అనంతపురం అర్బన్:
ప్రత్యేక ఓటర్ల సవరణలో భాగంగా ఇంటింటి సర్వేలో రాజకీయ పార్టీల నుంచి వచ్చిన దరఖాస్తులు, అభ్యంతరాలను నిశితంగా పరిశీలించి పరిష్కరించామని కలెక్టర్ గౌతమి ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాకు తెలిపారు. శుక్రవారం విజయవాడ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటరు జాబితా సవరణకు సంబంధించిన దరఖాస్తులు, అభ్యంతరాలు, పరిష్కారాలపై సీఈవో సమీక్షించారు.
కలెక్టరేట్ నుంచి కలెక్టర్ తో పాటు డీఆర్వో గాయత్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో క్లెయిమ్ల విచారణ, పరిష్కారం గురించి కలెక్టర్ సీఈఓకు వివరించారు. సవరణ క్రమంలో, ఫారం-6, 7 మరియు 8 దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే పరిష్కరించబడుతుంది.
రాజకీయ పార్టీల నుంచి అందుతున్న ఫిర్యాదులను అప్డేట్ చేస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి క్లెయిమ్లను నాణ్యతతో పరిష్కరించాలని సీఈవో తెలిపారు. రాజకీయ పార్టీల ఫిర్యాదుల పరిష్కారంలో రాజీపడవద్దని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీఓలు గ్రంధి వెంకటేష్, రాణీసుమిత, సి.శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు రవీంద్ర, సుధారాణి, వెంకటేశ్వర్లు, ఎన్నికల డీటీ కనకరాజ్, ఎస్ఏ శామ్యూల్ బెంజమిన్ పాల్గొన్నారు.
ప్రత్యేక ఓటర్ల జాబితా-2024 సవరణలో భాగంగా ఈ నెల 28న జిల్లాకు ఎన్నికల రోల్ పరిశీలకులు మురళీధర్ రెడ్డి రానున్నారని కలెక్టర్ గౌతమి శుక్రవారం వెల్లడించారు. ఉదయం 11 గంటలకు అనంతపురం చేరుకుని జిల్లాలో పర్యటిస్తారని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా వచ్చిన క్లెయిమ్లు, అభ్యంతరాలను పరిశీలించే ప్రక్రియను పరిశీలిస్తారని తెలిపారు.
Discussion about this post