‘రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. వీరిలో అవ్వాతాతలు, వితంతు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులు ఉన్నారు. అయ్యా.. చంద్రబాబు నాయుడూ.. ఇలాంటి వాళ్లను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. ఇబ్బంది పడిన వారందరికీ ఒకేమాట చెబుతున్నా. కొంచం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. మళ్లీ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికీ సేవలందించే ఫైల్పైన నా మొట్ట మొదటి సంతకం చేస్తాను’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు.
రాజకీయాలు నిజంగా దిగజారిపోయాయి. చెడిపోయాయి. ఏ స్థాయికి అంటే.. అవ్వాతాతలకు ఇంటి వద్ద ఇచ్చే పెన్షన్లను.. తాము చెబితేనే చంద్రబాబునాయుడు ఆపించారని అహంకార ధోరణితో వాళ్ల పార్టీ ఎమ్మెల్యేల అభ్యర్థులు(రాజమండ్రి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు పేరు ప్రస్తావన) చెప్పారు. సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారో చూస్తున్నాం. చంద్రబాబు దుర్మార్గం వల్లే 31 మంది అవ్వా, తాతలు ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబును హంతకుడు అందాం.. అంతకంటే దారుణంగా చెబుదామా?.వలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
‘మేమంతా సిద్ధం’ ఎనిమిదవ రోజు బస్సు యాత్ర గురువారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల పరిధిలో సాగింది. ఈ సందర్భంగా నాయుడుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ.. అడ్డు తగులుతున్న దుష్ట చతుష్టయంపై యుద్ధం ప్రకటించడానికి వచ్చిన ఆత్మబంధువులైన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, సోదరులు, స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
source : sakshi.com
 
	    	 
                                









 
                                    
Discussion about this post