ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పెద్దవరంలోని గ్రామ సచివాలయ సెంటరులో ఏర్పాటు చేసిన తెదేపా ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. తెదేపా సూపర్ సిక్స్ పథకాలతో పాటు తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్, విజయవాడ పార్లమెంట్ బాధ్యుడు కేశినేని శివనాథ్, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, లోకేశ్ చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఆదివారం ధ్వంసం చేయడంపై తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైకాపా అల్లరిమూకల పనేనని ఆరోపించారు.
source : eenadu.net










Discussion about this post