• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Sunday, May 25, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

28న తెదేపా-జనసేన ఎన్నికల శంఖారావం

Naresh Kumar by Naresh Kumar
February 23, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఫిబ్రవరి 28న తెదేపా, జనసేన ఉమ్మడి ఎన్నికల శంఖారావం పూరించనున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆ రోజు భారీ బహిరంగసభ నిర్వహించనున్నాయి. విజయవాడలోని నోవోటెల్‌ హోటల్‌లో గురువారం తెదేపా, జనసేన సమన్వయ కమిటీలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాయి. అనంతరం ఇరు పార్టీల నేతలు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్‌లు విలేకర్లకు ఈ వివరాలను వెల్లడించారు. భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అన్ని విషయాలు ప్రజలకు వెల్లడిస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు. ‘ఇప్పటికే మాతో పొత్తులో ఉన్న జనసేన ఎన్‌డీఏలో భాగస్వామి. ఆ కూటమిలో చేరాలని తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం అందింది. మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు దిల్లీ వెళ్లి మాట్లాడారు. చర్చలు జరుగుతున్నాయి. ఇందులో దాపరికమేదీ లేదు. త్వరలోనే అన్నీ ఖరారవుతాయి. ప్రజలకు అన్నీ వెల్లడిస్తాం’ అని ఆయన వెల్లడించారు. తెలుగుదేశం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నేతలు యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, తంగిరాల సౌమ్య… జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, ఆ పార్టీ నాయకులు కందుల దుర్గేష్‌, బి.మహేందర్‌రెడ్డి, కొటికలపూడి గోవిందరావు (చినబాబు), బొమ్మిడి నాయకర్‌, పాలవలస యశస్వి గురువారం విజయవాడలో భేటీ అయ్యారు. ఈ సమావేశం రెండు గంటలకు పైగా జరిగింది. ఉమ్మడి మ్యానిఫెస్టోకు తుదిరూపు ఇవ్వడం, ఉమ్మడి బహిరంగసభ నిర్వహణ, రెండు పార్టీల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం రెండు పార్టీల నాయకులు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

ఇరు పార్టీల శ్రేణులకు దిశానిర్దేశం

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని, ఏపీలో వైకాపాకు బైబై చెప్పాలని ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పొత్తు నిర్ణయం తీసుకుని కలిసి ప్రయాణిస్తున్నాయి. తాడేపల్లిగూడెంలో ఉమ్మడి ఎన్నికల శంఖారావంలో రెండు పార్టీల శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరాన్ని ఉమ్మడిగా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నాయి. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ల నేతృత్వంలో జరిగే సభకు రెండు పార్టీల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులంతా హాజరవుతారు. దాదాపు 6 లక్షల మంది ఈ బహిరంగసభకు హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నట్లు నాయకులు వెల్లడించారు.

మ్యానిఫెస్టోపై కసరత్తు

ఉమ్మడి మ్యానిఫెస్టోపైనా సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. దాదాపు ఇది కొలిక్కి వచ్చింది, తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలుగుదేశం ఇప్పటికే ‘సూపర్‌ సిక్స్‌’ పేరుతో ప్రజలకు ఏం చేయబోతున్నామో చెప్పి, వాటిని జనంలోకి తీసుకెళ్తోంది. మరోవైపు ‘జనసేన షణ్ముఖ వ్యూహం’లో భాగంగా ప్రజలకు ఏమేం చేయబోతున్నారో ప్రకటించారు. ఈ రెండింటినీ కలపడంతో పాటు ఇంకా ఏయే అంశాలు చేర్చాలో ఈ సమావేశంలో చర్చించారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశాం: మనోహర్‌

వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు లక్ష్యంగా జనసేన తెదేపాతో పొత్తు పెట్టుకుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ఎక్కడా లోపం లేకుండా రెండు పార్టీల నాయకులు మంచి భావనతో ముందుకు సాగుతున్నామన్నారు. సీట్లు, ఓట్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇరు పార్టీలకు ఎక్కడా నష్టం వాటిల్లకుండా ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. ఉమ్మడిగా, బలంగా కలిసి పని చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. పొత్తు ధర్మంలో భాగంగా కొందరు నాయకులు త్యాగాలు చేయడానికి సిద్ధపడాలని, కచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు.

source : eenadu.net

Tags: 2024 election campaigningap tdp janasena bjp alliancejanasena leadersTDP leaders

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

 టీడీపీకి ఎన్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా..?

Discussion about this post

  • పాతకొత్తచెరువు
  • అరెస్ట్ చేయరా చెయ్
  • వాలంటీర్లుఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు
  • ధర్మవరం జనసేన పార్టీ ఇంచార్జ్ చిలకం మధుసూదన్ ఆధ్వర్యంలో పార్టీ లోకి చేరిన 10 కుటుంబాలు
  • అక్రమ ఓట్లను తొలగిస్తే టీడీపీకి ఓటమి తప్పదు

  • వైకాపానా.. మజాకా
  • తెలుగుదేశం అభ్యర్థుల చివరి జాబితా
  • శివ పార్వతుల కల్యాణం కి ఒక లక్ష విరాళం
  • అయిదేళ్లలో అయిదు సార్లయినా రైతుల్ని కలిశారా.. జగన్‌?
  • మాకు చెప్పకుండా విద్యార్థులకు భోజనం పెట్టిస్తారా?

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In