వేరే పార్టీకి ఓటు వేస్తే ఎలాంటి పథకాలు రావని ధర్మవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓటర్లను బెదిరించేలా మాట్లాడారు. గురువారం బత్తలపల్లిలో రోడ్డుషో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భాజపా అభ్యర్థి సత్యకుమార్ పెద్ద మాయల మరాఠీ అని ఎద్దేవా చేశారు. ఇటీవల వైకాపాను వీడి భాజపాలోకి చేరిన కురబ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సూర్యప్రకాశ్ బాబుపై పరోక్షంగా విమర్శలు చేశారు. రోడ్డు షో కారణంగా జనం ఇబ్బంది పడ్డారు.
source : eenadu.net










Discussion about this post