రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు
5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఆర్ఆర్బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీఘర్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబయి, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్పూర్.
అర్హత: అభ్యర్థులు మెట్రిక్యులేషన్తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్లో మూడేళ్ల డిప్లొమా చేసినవారూ అర్హులే.
వయసు: 01-07-2024 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.
ఎంపిక: రాత పరీక్షలు(సీబీటీ-1, 2), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.\
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19-02-2024
వెబ్సైట్: http://indianrailways.gov.in/
source : eenadu.net
Discussion about this post