తెదేపా అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో తెదేపా పోటీ చేయనుంది. ఇదివరకే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా మరో 11 మందిని వెల్లడించింది. 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగులో ఉంచింది.
అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు..
పలాస-గౌతు శిరీష, పాతపట్నం- మామిడి గోవిందరావు, శ్రీకాకుళం-గొండు శంకర్, శృంగవరపుకోట- కోళ్ల లలితకుమారి, కాకినాడ సిటీ- వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు), అమలాపురం- అయితాబత్తుల ఆనందరావు, పెనమలూరు-బోడె ప్రసాద్, మైలవరం- వసంత వెంకట కృష్ణప్రసాద్, నరసరావుపేట- చదలవాడ అరవిందబాబు, చీరాల- మద్దులూరి మాలకొండయ్య యాదవ్, సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి
లోక్సభ స్థానాల అభ్యర్థులు..
శ్రీకాకుళం- కింజరాపు రామ్మోహన్నాయుడు, విశాఖపట్నం- మతుకుమిల్లి భరత్, అమలాపురం- గంటి హరీష్, ఏలూరు- పుట్టా మహేశ్ యాదవ్, విజయవాడ- కేశినేని శివనాథ్ (చిన్ని), గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట- లావు శ్రీకృష్ణ దేవరాయలు, బాపట్ల- టి.కృష్ణ ప్రసాద్, నెల్లూరు- వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు- దగ్గుమళ్ల ప్రసాదరావు, కర్నూలు- బస్తిపాటి నాగరాజు (పంచలింగాల నాగరాజు), నంద్యాల- బైరెడ్డి శబరి, హిందూపురం- బీకే పార్థసారథి
Discussion about this post