ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం అసెంబ్లీ హాట్ టాపిక్ గా మారింది….!! ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి…కానీ ధర్మవరంలో జరిగిన ర్యాలీ జనంతో పాటు…( జనం అనేదానికంటే టీడీపీ శ్రేణులు అనడం సమంజసమేమో..!) ధర్మవరం లో జరిగిన ర్యాలీ పార్టీ అధిష్టానానికి సవాల్ విసిరినట్లు గానే కనిపిస్తోంది. ధర్మవరం టీడీపీకి కంచుకోట అనడంలో అతిశయోక్తి లేదు…!! అలాంటి ధర్మవరాన్ని టీడీపీకి కేటాయించకుండా బీజేపీకి కేటాయించడమేంటి? అనేది టీడీపీ కార్యకర్తల్లో నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి..!! ఇది సహజం…పార్టీ బలంగా వున్న నియోజకవర్గాలను మిత్ర పక్షాలకు కేటాయించడం ద్వారా పార్టీ ఉనికికే ప్రమాదం అని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి…! చంద్రబాబు మాటకు ఆయన మాటకున్న విలువకు ఈ నియోజక వర్గం దర్పనంగా మారుతుందనడంలో ఆశ్చర్యం లేదు…! బాబుగారు మాట ఇస్తే మాటమీద నిలబడడు అని ప్రత్యర్థిపార్టీలు పదే పదే వ్యాఖ్యానిస్తుంటాయి… అవి నుజం కాకూడదని పార్టీ వర్గాలు ఆశిస్తుంటాయి…బాబు గారు స్వప్రయోజనాలు సూస్తున్నారా? లేక పార్టీ కార్యకర్తలు ప్రజల మనోబావాలకు విలువ ఇస్తున్నారా..? అనే విషయం ఆయన అంతరాత్మకే వదిలేయాలి…పార్టీ కోసం ప్రజలకోసం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే డబ్బులు వ్యవస్థను కంట్రోల్ చేసే శక్తి అవసరమే…! కానీ అన్ని సందర్భాల్లోనే అవే కీలకం కాదు…ప్రజలు పార్టీ కార్యకర్తల మనోబావాలను కూడా గుర్తెరిగి అడుగులేయాల్సిన అవసరం చంద్రబాబుగారి వుందని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు….కళ్యాణదుర్గం విషయంలో పార్టీ కార్యకర్తల మనోబావాలు దెబ్బతిన్నాయన్నది వాస్తవ విషయం….పార్టీ కోసం పవి చేయక్కరలేదు డబ్బులుంటే చాలు ఏదైనా సాధ్యమే అనే బావన చంద్రబాబుగారే కల్పించారని కళ్యణదుర్గం గుంతకల్లు అసెంబ్లీ వ్యవహారాలు స్పష్టం చేస్తున్నాయి…ఇదేరీతిలో నేడు ధర్మవరం కూడా ఆ జాబితాలోకి చేరిందన్న అభిప్రాయం ( నిజంగా ఈ స్థానం బీజేపీకి కేటాయించినట్లు అయితే) కార్యకర్తల్లోనే కాదు సామాన్య ప్రజానీకంలో కూడా నెలకొంటుంది….నేటి యూత్ కి చంద్రబాబు రోల్ మోడల్ గా మారారు…మరి నేడు అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితులను గమనిస్తే బాబుగారు కూడా అందరిలాగానే మారిపోయారా? అని యూత్ ఆలోచనలో పడుతుంది…2009 లో సీపీ ఐ కి ఈస్థానాన్ని కేటాయించి ఎంత పొరపాటు చేశారో అదే తప్పిదాన్ని నేడు టీడీపీ నేడుచేస్తోందా…? ఏమో ఇదే నిజమైతే చంద్రబాబు గారు ఆత్మపరిశీలన చేసుకోవీల్సిందే…. ఇది ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే….ఎవ్వరి ప్రయోజనాలు వారివి విలువలకు సంబంధంలేదు…ప్రయోజనం ముఖ్యం నేను నాది అనిృస్వార్థంతో అడుగులేసే వారికి ఈ పోస్ట్ అవసరమ లేదు…

Discussion about this post