• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Monday, May 19, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

వాలంటీర్లుఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు

Naresh Kumar by Naresh Kumar
March 17, 2024
in రాజకీయం
Reading Time: 2min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

వాలంటీర్లు ప్రభుత్వంలో భాగమే కాబట్టి.. వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా హెచ్చరించారు. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయన్నారు. ఉపాధ్యాయులు లేకుండా ఎన్నికలు నిర్వహించలేమని, ఎన్నికల విధుల్లో దాదాపు 60 శాతం వారే ఉంటారన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకున్నా.. కేవలం వేలికి ఇంకు వేయడానికే పరిమితం చేస్తామని తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఉండే అయిదుగురు అధికారుల్లో, సచివాలయ సిబ్బంది ఒక్కరే ఉంటారని స్పష్టం చేశారు. శనివారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

46,165 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

‘రాష్ట్రంలో మొత్తం 4,09,37,352 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 2,00,84,276, స్త్రీలు 2,08,49,730, ఇతరులు 3,346, ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 7,763, సర్వీసు ఓటర్లు 67,393, 85 ఏళ్లకు పైగా ఉన్నవారు 2,12,237 మంది ఉన్నారు. గత 45 రోజుల్లోనే దాదాపు 1.75 లక్షల మంది ఓటు నమోదు చేసుకున్నారు. ఓటు నమోదు కోసం ఏప్రిల్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరోజు వరకు వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హులకు ఓటుహక్కు కల్పిస్తాం. శనివారం నుంచి తొలగింపు దరఖాస్తులు స్వీకరించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 46,165 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 179 కేంద్రాల్లో మహిళా సిబ్బంది మాత్రమే విధుల్లో ఉంటారు. పోలింగ్‌కు అయిదు రోజుల ముందు ఓటర్‌ స్లిప్పులు పంపిణీ చేస్తాం. 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేయడానికి వెసులుబాటు కల్పిస్తున్నాం. ఇందుకోసం ఫాం-12 దరఖాస్తులు నింపాల్సి ఉంటుంది. రిటర్నింగ్‌ అధికారి వాటిని పరిశీలించి ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తారు. సంక్షేమ పథకాలకు ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేస్తే.. ఈసీఐ ఆమోదంతో వారికి ప్రయోజనాలు అందించవచ్చు. అయితే ఇప్పుడు లబ్ధిదారులను ఎంపిక చేయకూడదు’ అని స్పష్టం చేశారు.

2 లక్షల ఈవీఎంల కేటాయింపు

‘అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్‌ పత్రాలు నింపవచ్చు. కానీ.. సంబంధిత పత్రాలను వ్యక్తిగతంగానే ఆర్వోకు అందించాలి. క్రిమినల్‌ కేసులున్న అభ్యర్థులు పత్రికల్లో తప్పనిసరిగా మూడుసార్లు ప్రకటనలివ్వాలి. ఈ ఎన్నికల కోసం దాదాపు 3.82 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులతో సహా దాదాపు 4 లక్షల మంది సిబ్బందిని వినియోగిస్తాం. 50 మంది జనరల్‌ అబ్జర్వర్లు, ప్రతి అసెంబ్లీకి మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఏర్పాటు చేశాం. 2 లక్షల ఈవీఎంలను ఈసీఐ కేటాయించింది’ అని వెల్లడించారు.

24 గంటల్లో పోస్టర్లు తొలగించాలి

‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో 24 గంటల్లోగా ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల నుంచి రాజకీయ నేతల పోస్టర్లు తొలగించాలి. లబ్ధిదారులకు ఇచ్చే పథకాలు, కార్యాలయాలపై సీఎం ఫొటోలు ఉండకూడదు. కొత్తగా ఎలాంటి పనులు చేపట్టరాదు. శనివారం నుంచి అధికార యంత్రాంగం పూర్తిగా ఈసీ ఆధీనంలోకి వస్తుంది. మంత్రులు, ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్‌ వర్తించదు. సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా ఆ జిల్లా ఎస్పీ బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని ముకేశ్‌కుమార్‌ మీనా పేర్కొన్నారు.

121 చెక్‌పోస్టుల ఏర్పాటు

‘ఎన్నికల షెడ్యూలు వెలువడటానికి ముందు నుంచే రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ఠ నిఘా పెట్టాం. 121 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు రూ.164 కోట్ల విలువ గల నగదు, వస్తువులు, మాదకద్రవ్యాలు, మద్యం స్వాధీనం చేసుకున్నాం. ఎన్నికల నిర్వహణ, భద్రతకు 2,18,515 మంది పోలీసులు అవసరం. రాష్ట్రంలో 45,000 మంది సివిల్‌ పోలీసులు, 32 కంపెనీల ఆర్మ్‌డ్‌ బలగాలు ఉన్నాయి. కేంద్రం నుంచీ మరిన్ని బలగాలు వస్తాయి’ అని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ శంకబ్రత బాఘ్చి తెలిపారు.

source : eenadu.net

Tags: 2024 election codeACTIONS IF VOLUNTEERS PARTICIPATE IN ELECTION CAMPAIGNAndhraPradeshap state election commissioner mukeshkumar meena

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

అనంతపురం లో అనంతోత్సాహం…

Discussion about this post

  • తెదేపాతోనే నిరుద్యోగులకు న్యాయం
  • వేకువనే పోలీసు పంజా
  • గుగూడు
  • వైకాపాను ఇంటికి సాగనంపడమే లక్ష్యం
  • బతికే ఉన్నా..

  • వాలంటీర్లకు వందనమా.. వైకాపా ప్రచారమా
  • కూటమిలో కుతకుత
  • చరవాణిలో గొడవ: తమ్ముడిపై అన్నయ్య దారుణంగా దాడి చేశాడు.
  • పి.సిద్దరాంపురం
  • బ్రాహ్మణపల్లి

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In