• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Tuesday, May 13, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

మా అభ్యర్థులు పేదోళ్లు

Naresh Kumar by Naresh Kumar
March 30, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

వైకాపా తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులు పేదోళ్లని.. వారి ఆర్థికపరిస్థితి అంతంత మాత్రమేనని సీఎం జగన్‌ శుక్రవారం ఎమ్మిగనూరులో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభలో వ్యాఖ్యానించడంతో పలువురు ఆశ్చర్యపోయారు. కర్నూలు మేయర్‌ బీవై రామయ్య పేదవాడని, ఆలూరు అభ్యర్థిగా పోటీచేస్తున్న విరూపాక్షి కూడా పేద వ్యక్తని, తన చెల్లెలు బుట్టమ్మ (బుట్టా రేణుక) ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, కోడుమూరు అభ్యర్థి డాక్టర్‌ సతీశ్‌ దగ్గర డబ్బుల్లేవని, ఐఏఎస్‌ అధికారిగా పనిచేసి, ఇటీవలే రాజీనామా చేసి కర్నూలు అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్‌ ఇంతియాజ్‌ దగ్గర కూడా డబ్బులు లేవని, ఆదోని అభ్యర్థి సాయన్న (సాయి ప్రసాద్‌రెడ్డి), మంత్రాలయం అభ్యర్థి బాలనాగిరెడ్డి కూడా సౌమ్యులని, వారిద్దరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేననడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వారంతా కోటీశ్వరులని, విలాసవంతమైన కార్లు, బంగళాలు ఉన్నాయని అంతా అనుకుంటున్న వేళ ముఖ్యమంత్రి పేదలు అనేసరికి అందరికీ ఒక్కసారి షాకయ్యారు. తనది పేదల పార్టీ అని, మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని, అందులో పెత్తందారులంతా ఒకవైపు, పేదలంతా ఒకవైపు ఉండి పోరాడాలంటూ సీఎం పిలుపునివ్వడం గమనార్హం.

చెప్పిందే… చెప్పారు.. వినలేక జనం వెనక్కి

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

నా అక్కలు, చెల్లెళ్లు, నా బీసీలు, ఎస్సీలు అంటూ సీఎం జగన్‌ ప్రభుత్వ పథకాల గురించి చెప్పిందే పదే పదే వల్లెవేశారు. సాయంత్రం 4:30 గంటలకు అని చెప్పి 5:53 గంటలకు సభకు హాజరయ్యారు. సభలో ప్రసంగిస్తూ నాడు-నేడు, విద్యా దీవెన, అమ్మఒడి పథకాల గురించే చెప్పినా, ప్రజల నుంచి స్పందన లేదు. సీఎం మాట్లాడిన ఐదు నిమిషాలకే ప్రజలు వెనుదిరిగారు. ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ, డోన్‌, కోడుమూరు, కర్నూలు, పాణ్యం, ఇతర ప్రాంతాల నుంచి 1,300 బస్సుల్లో ప్రజలను తరలించారు. ఎమ్మిగనూరు వీవర్స్‌ కాలనీ చేనేత మైదానంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేశారు. దీనికి ఇరువైపులా బారికేడ్లు కట్టి, బ్యానర్లు వేశారు. మధ్యలో ర్యాంప్‌ వేసి పెద్దఎత్తున జనం పోగైనట్లు చూపించారు. జగన్‌ ఏదో హామీ ఇస్తారని ఆశతో వచ్చి నిరాశతో వెళ్లిపోయారు.

ప్రసంగంలో పదే పదే ఆయా పథకాలకు సంబంధించిన డబ్బులు మీ ఖాతాల్లో వేశామంటూ చెప్పారు. గత ప్రభుత్వ ఆలోచనలతో రాష్ట్రంలో నూటికి 30 మంది ఆడపిల్లలు పదో తరగతి పూర్తిచేసే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ గురించి 14 నిమిషాలు మాట్లాడారు. బాల్యవివాహాలు తగ్గాయని చెప్పినా, జిల్లాలో పశ్చిమ ప్రాంతంలోనే ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు, క్షేత్రస్థాయిలో కొండలు, గుట్టలే కనిపిస్తున్నాయి.

తాము మహిళలు, యువత సంక్షేమానికి ఎంతో పాటుపడ్డామని, మహిళల ఖాతాల్లో రూ.లక్షలకు లక్షలు కనిపిస్తాయని, మహిళలు తన ప్రభుత్వానికి రక్షాబంధన్‌ కట్టాలంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో కరవు కారణంగా వేలమంది రైతులు వలసపోతున్నా…. తాను రైతులను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నానంటూ ముఖ్యమంత్రి ప్రకటించడంపై పలువురు అసహనానికి లోనయ్యారు.

పదవులిచ్చినా పెత్తనం లేకుండా చేస్తున్నారని.. రిజర్వుడు నియోజకవర్గాల్లో పెద్దల ఆధిపత్యమే కొనసాగుతోందని.. నియోజకవర్గంలో తమకు విలువే లేకుండా పోతోందని వైకాపా దళిత ఎమ్మెల్యే ఆర్థర్‌ బహిరంగంగా ప్రకటించారు. అయినా ముఖ్యమంత్రి మాత్రం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ వారికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నానని, 50% టికెట్లు వారికే ఇస్తున్నానని చెప్పడం గమనార్హం.

దళితులకు గతంలో అమలుచేసిన 27 పథకాలు రద్దుచేయడం, ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను పక్కదారి పట్టించడంపై సమతా సైనిక్‌దళ్‌ రాయలసీమ అధ్యక్షుడు రంగయ్య ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించారు. సంస్థ సభ్యులను తన ఇంటికి పిలిచి మాట్లాడారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని గృహనిర్బంధం చేశారు. కమిటీ రోడ్డులో ఉన్న ఆయనతోపాటు మల్లేశ్‌, పరమేశ్‌, రాజోలప్ప తదితరులను గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు మంత్రాలయం పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇదెక్కడి అన్యామని అడిగితే వారిని ఈడ్చిపారేశారు.దీంతో కొందరికి దెబ్బలు తగిలాయి. దీంతో వారు ‘సీఎం డౌన్‌డౌన్‌’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.

source : eenadu.net

Tags: 2024 electionsap cm ys jagan bus yatraAP CM ys jagan mohan reddyysrcp

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

జగన్‌ నిర్వాకం వల్లే సీమలో కరవు

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In