• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Monday, May 19, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

మళ్లీ జగన్‌ భజన

Naresh Kumar by Naresh Kumar
March 6, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

ఎడాపెడా సంక్షేమ పథకాల కోతలు, నిత్యావసరాల ధరలు, విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు, ఇతర పన్నులు అమాంతం పెంచి నడ్డివిరవడాల ఊసే ఎత్తకుండా ‘ప్రతి కుటుంబానికి అంత చేశాం…ఇంత చేశాం’ అంటూ రెండేళ్లుగా ప్రజల చెవులు దిమ్మెక్కేలా ఇళ్ల ముందుకొచ్చి మరీ వాయించినా ముఖ్యమంత్రి జగన్‌కు తనివితీరినట్టు లేదు. వారం, పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే తరుణంలోనూ తన భజన మంత్రాన్ని వీడటం లేదు. మరోమారు ప్రజల ఇళ్ల ముంగిటకు వెళ్లి లేఖలు అందిస్తూ బాకా ఊదేందుకు సన్నద్ధమయ్యారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఉన్న గీతను ఎప్పుడో చెరిపేసి అన్నింటికీ వాలంటీర్లనే వినియోగిస్తూ నిస్సిగ్గుగా పాలించిన ఆయన.. చివరి ప్రయత్నానికీ వారినే ఉపయోగించనున్నారు. దీనికి ఠంచనుగా షెడ్యూలు ప్రకటించిన వైకాపా ప్రభుత్వం 8, 9, 10 తేదీల్లో అంటే మూడు రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి కుటుంబం దగ్గరకు వెళ్లి జగన్‌ డప్పు కొట్టాలని దిశానిర్దేశమూ చేసింది.

ఇప్పటికే ‘గడప, గడపకు మన ప్రభుత్వం’, ‘జగనే ఎందుకు కావాలి?’ ‘మా నమ్మకం నువ్వే జగన్‌’, ఇలా రకరకాల కార్యక్రమాల పేరుతో వాలంటీర్లను ఇళ్ల చుట్టూ తిప్పారు. ఇచ్చేది జగన్‌ జేబులో సొమ్మయినట్లు ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల రూపంలో ఆర్థిక సాయం అందించినట్లు పదే పదే ప్రచారం చేశారు. ఒక పెద్ద లేఖను ముద్రించి ఇచ్చారు. అదే కుటుంబం నుంచి ఛార్జీల పెంపు, పన్నుల బాదుడు, తదితర రూపాల్లో ఎంత లాక్కున్నది మాత్రం అందులో చెప్పరు. ఇప్పుడు మళ్లీ అదే ఎత్తుగడను వేసి మరింత గట్టిగా జగన్‌ డప్పు కొట్టాలని వాలంటీర్ల చేతికి మళ్లీ రెండు పేజీల లేఖలిచ్చి ప్రజల ముందుకు పంపించబోతున్నారు. భజన గట్టిగా ఉండేందుకేనేమో రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నేతలు వాలంటీర్లకు తాయిలాలు ఎర వేస్తున్నారు. అసత్యాలు వల్లె వేయడంలో జగన్‌ ఆరితేరిపోయారు.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

ఎన్నికలు దగ్గరపడటంతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఇప్పుడు మరింతగా చెలరేగిపోతున్నారు. 129 హామీలిస్తే వాటిలో ఏకంగా 128 నెరవేర్చేశారట! 99 శాతం వాగ్దానాలు నెరవేర్చినట్టు లేఖలో అచ్చు వేయించుకున్నారు. మద్య నిషేధం, సీపీఎస్‌ రద్దు, ఇస్లాం బ్యాంకు ఏర్పాటు, మండలానికో వృద్ధాశ్రమం, 25 లక్షల ఇళ్లు కట్టించడం, యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చిందెవరో.. వాటిని అమలు చేయకుండా గాలికొదిలేసిందెవరో జగన్‌కే తెలియాలి. ఇవే కాదు.. గత ఎన్నికల ముందు పాదయాత్ర పేరుతో ఊరూరా తిరిగి వివిధ వర్గాలకు ఇచ్చిన వందల కొద్దీ హామీలన్నీ బుట్టదాఖలు చేశారు. ఇన్ని దాచిపెట్టి ‘చెప్పాడంటే చేస్తాడంతే’ అని ప్రచారం చేసుకోవడం నిజంగా విడ్డూరమే. ఇంటింటికీ వెళ్లి భజన చేసేటప్పుడు ఇవి కూడా చెప్పాలి కదా?

వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసే రెండు పేజీల లేఖలో ఒకవైపు విద్య, వైద్యం, వ్యవసాయం రంగంలో సాధించింది నామమాత్రమే అయినా అపారమైన ప్రగతి సాధించామంటూ ఎప్పుడూ చెప్పే పాత చింతకాయపచ్చడి లెక్కలే ఉన్నాయి. రెండోవైపు అయిదేళ్ల కాలంలో ఒక్కో కుటుంబానికి పింఛను నుంచి కొవిడ్‌ సాయం వరకు వివిధ పథకాల కింద అందిన లబ్ధిని లెక్కగట్టి వచ్చిన మొత్తాన్ని ముద్రించారు. దీనికి గడపగడపకూ సంక్షేమమనే పేరు పెట్టారు. ఇలాంటి లేఖల్ని రాష్ట్రవ్యాప్తంగా 1.47 కోట్ల కుటుంబాలకు అందించనున్నారు. లేఖ ఇవ్వడంతోనే వదిలేస్తే జగన్‌ గొప్పదనమేముంది? వాలంటీర్లు బాకా ఊదాల్సిందే. దాన్ని వినేందుకు వివిధ పథకాల లబ్ధిదారులందరూ చెవుల్ని ‘సిద్ధం’ చేసుకోవాల్సిందే. ఆ లేఖ అందుకున్న ప్రతి కుటుంబంలోనూ ఒకరు దాన్ని ధ్రువీకరిస్తూ యాప్‌లో వేలిముద్ర వేయాల్సిందే. ప్రతిసారీ ఇలా లేఖలు లేఖలంటూ వాటిని అచ్చేసేందుకు రూ.కోట్ల ప్రజాధనాన్ని పార్టీ ప్రచారానికి తగలేస్తూనే ఉన్నారు.

source : eenadu.net

Tags: 2024 electionsAP CM ys jagan mohan reddycm ys jagannavarathnaalu scheems in andhrapradesh

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

2022 నుంచి శిల్పంలా మారిపోయిన జగన్‌

Discussion about this post

  • తెదేపాతోనే నిరుద్యోగులకు న్యాయం
  • వేకువనే పోలీసు పంజా
  • గుగూడు
  • వైకాపాను ఇంటికి సాగనంపడమే లక్ష్యం
  • బతికే ఉన్నా..

  • వాలంటీర్లకు వందనమా.. వైకాపా ప్రచారమా
  • కూటమిలో కుతకుత
  • చరవాణిలో గొడవ: తమ్ముడిపై అన్నయ్య దారుణంగా దాడి చేశాడు.
  • పి.సిద్దరాంపురం
  • బ్రాహ్మణపల్లి

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In