• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Tuesday, May 13, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకూ నీరు

Naresh Kumar by Naresh Kumar
April 22, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

‘ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకూ నీరందించడటమే తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వ లక్ష్యం. సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళతాం. నదులను అనుసంధానిస్తాం. వీలైనంత త్వరగా పోలవరం పూర్తి చేసి వలసలు, పస్తులు లేని రాష్ట్రాన్ని నిర్మిస్తాం. చేతివృత్తులను ఆదుకుంటాం. భవన నిర్మాణ కార్మికులను కాపాడుకుంటాం..’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, భీమవరంలలో ఆదివారం నిర్వహించిన వారాహి విజయభేరి సభల్లో ఆయన ప్రసంగించారు. ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు కీలకమని రాష్ట్ర భవిష్యత్తు కోసం కేంద్రంతో మాట్లాడి పొత్తు కోసం చాలా విషయాల్లో తగ్గానని అన్నారు. అన్న క్యాంటీన్లతోపాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లనూ నడిపిస్తామన్నారు. వశిష్ట వారధి పూర్తి చేయకుండా ఓట్లు అడగబోనని చెప్పిన జగన్‌కు ఈ ఎన్నికల్లో ప్రచారానికే అర్హత లేదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో 34 శాతమున్న బీసీ రిజర్వేషన్లను 24 శాతం చేసి రాజకీయ ప్రాధాన్యం లేకుండా చేశారని, రిజర్వేషన్‌ను తమ కూటమి ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని తెలిపారు. కోనసీమలో రైలు కూత నరసాపురం వరకు వినిపించేలా చేస్తామని హామీనిచ్చారు.

‘ఆక్వా రైతులు కష్టాలు చెప్పి జగన్‌ను సాయం కోరితే వారికి గుదిబండలా మారారు. తెదేపా ప్రభుత్వం యూనిట్‌ విద్యుత్తు రూపాయిన్నర రాయితీతో ఇస్తే జగన్‌ రూ.5 చేసి నిండా ముంచారు. ప్యాలెస్‌ల మీద ప్యాలెస్‌లు కడుతున్న జగన్‌కు హార్బర్‌, జెట్టి కట్టడం చేత కాలేదు. 70 లక్షల మత్స్యకార కుటుంబాలను దోచేందుకు 217 జీవో తెచ్చారు. దాన్ని మన ప్రభుత్వం రాగానే రద్దు చేస్తాం. మత్స్యకారులకు రూ.10 లక్షల ప్రమాద బీమా వర్తింపజేస్తాం’ అని పేర్కొన్నారు. శెట్టి బలిజలపై తప్పుడు ఎక్సైజ్‌ కేసులు తొలగిస్తామని అన్నారు.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

‘నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు. అన్ని కులాలు బాగుపడాలని కోరుకునేవాణ్ని. ఓటుబ్యాంకు రాజకీయాలు చేయను. జగన్‌కు కాపు ఓట్లు కావాలి. వారితో నన్ను తిట్టించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. మీరు శివశివాని స్కూల్‌లో పేపర్లు లీక్‌ చేసే కాలంలోనే చేగువేరా గురించి చదువుతున్నా. మీకు, నాకు అంత వ్యత్యాసముంది. నేను ఎమ్మెల్యే ప్రసాదరాజును తిడితే ఆయన్ని మాత్రమే తిట్టినట్లు. ఆయన కులాన్ని కాదు. నరసాపురంలో కక్షకట్టి ఒకే కులానికి చెందిన 40 మంది అధికారులను అన్యాయంగా బదిలీ చేయించారు. జగన్‌.. మీరు కులాలను విడగొడితే నేను ఏకం చేస్తా. వైకాపా గూండాలకు ఇదే హెచ్చరిస్తున్నా..’ అని పవన్‌ పేర్కొన్నారు.

‘మా అన్నయ్య వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. సీఎం రమేశ్‌, పంచకర్ల రమేశ్‌కు ఇద్దరికి మద్దతు తెలుపుతున్నానని అన్నయ్య అనగానే చిరంజీవి వచ్చినా ఎవరొచ్చినా సింహం సింగిల్‌గా వస్తుందంటూ సజ్జల ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీరు ప్రజల పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తింటున్నారు. ఎన్నికల సంఘం పార్టీలకు అనుకూలంగా మాట్లాడొద్దని చెప్పినా మారరు. అన్నయ్య అజాతశత్రువు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మా అన్నయ్య జోలికి వస్తే సహించేది లేదు. గతంలో మూడు రాజధానుల నిర్ణయం మంచిదేనని ఆయనతో అనుకూలంగా మాట్లాడించినా.. తమ్ముడిగా సహించా. వైకాపా పాలనలో చిరంజీవి, రజినీకాంత్‌ వంటి గొప్పవారికే మాట్లాడే స్వేచ్ఛ లేదు’ అని పవన్‌ తెలిపారు. ‘రాష్ట్రంలో 50 స్థానాల్లో బలమైన అభ్యర్థులుండీ పోటీ చేయగలిగే స్థాయిలో ఉండీ మీ భవిష్యత్తు కోసం వెనక్కి తగ్గా. జనసేన పోటీ చేస్తోంది 21 స్థానాలు కాదు.. 175 అని గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీలో వశిష్ట వారధి, డీఎస్సీ, నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై చర్చించాలంటే కూటమి ప్రభుత్వం రావాలి’ అని పవన్‌ పేర్కొన్నారు.

‘రాష్ట్రంలో ఏటా 1.3 లక్షల మంది విద్యార్థులు పట్టభద్రులవుతున్నా.. 30 శాతం మందికి కూడా ఉద్యోగాలు దొరకడం లేదు. వైకాపా రూ.5 వేలిచ్చి యువతను వాలంటరు ఉద్యోగాలకు పరిమితం చేయడం దారుణం. 20 రోజులుగా వైరల్‌ జ్వరంతో బాధపడుతున్నా ప్రజల భవిష్యత్తు కోసమే బయటకు వచ్చా’ అని జనసేనాని అన్నారు.

source : eenadu.net

Tags: 2024 election campaigningjanasenajanasena chief pawan kalyan

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

జీ‘వి’తాలతో ఆడుకున్నారు

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In