• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Sunday, May 25, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

నన్ను.. నా సిబ్బందినీ బ్లేడ్లతో కోస్తున్నారు!

Naresh Kumar by Naresh Kumar
April 2, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

‘పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందర్నీ కలవాలన్నది నా కోరిక. ఇక్కడున్న రెండు లక్షల పైచిలుకు జనాభాలో ప్రతి ఒక్కరితో ఫోటో తీయించుకోవాలనుకుంటున్నాను. కానీ భద్రతా కారణాల వల్ల ఇబ్బంది వస్తోంది.. జనం ఎక్కువమంది పోగైనప్పుడు కిరాయి మూకలు చొరబడి సన్నని బ్లేడ్లు తీసుకొచ్చి నన్ను, నా సిబ్బందినీ కోసి గాయపరుస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కదా.. అందుకే భద్రత మరింత కట్టుదిట్టంగా ఉంటే బాగుంటుందని జాగ్రత్తలు తీసుకుంటున్నా’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. పిఠాపురంలో 100 మందికి పైగా నాయకులు సోమవారం సాయంత్రం జనసేనలో చేరారు. వారందరికీ కండువా కప్పి ఆహ్వానించిన జనసేనాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, మీ కోసమే ఇక్కడికి వచ్చానని.. అందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు.

‘నేను ఎప్పుడూ ఎవర్నీ, ఏదీ అభ్యర్థించను. ఒక్క దేవుణ్నే అభ్యర్థిస్తాను. అదీ రెండుసార్లు మాత్రమే కోరుకున్నా’ అని పవన్‌ తెలిపారు. ‘మహబూబ్‌నగర్‌ నుంచి ఓ అభిమాని వచ్చాడు.. ‘ఒక్క హిట్‌ ఇయ్యన్నా.. రోడ్లమీద తిరగలేకపోతున్నామన్నా.. హిట్‌ లేకపోతే చచ్చిపోతామన్నా’ అన్నాడు.. అభిమానుల కోసం ఒకసారి భగవంతుణ్ని కోరుకున్నాను. అలాగే భీమవరంలో ఓడిపోయిన తర్వాత, మనవాళ్లంతా నలిగిపోతుంటే.. తండ్రీ ఒక్కసారి విజయం అంటే ఏమిటో చూపించమని కోరుకున్నా. అలా అడిగినందుకు పిఠాపురం వాళ్లు గెలిపిస్తామని పిలిచారు. ఇక్కడి ప్రజలకు రుణపడి ఉంటా’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రతి గ్రామంలో పర్యటిస్తానని, ప్రజలతోనే ఉంటానని, ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ‘శ్రీపాద శ్రీవల్లభుడు.. ఆంధ్ర బాప్టిస్ట్‌ చర్చి సాక్షిగా చెబుతున్నా. పిఠాపురం నా స్వస్థలం చేసుకుంటా. ఇక్కడ ఉండి సాధ్యమైనంత మేరకు మీకు సేవ చేసుకుంటా. ఇక్కడి గ్రామాలన్నీ వెతుకుతున్నా. ఏదో ఒక గ్రామంలో ఇల్లు తీసుకుంటా. అక్కడికొచ్చి ఉంటా.. అందరికీ అండగా ఉంటా’ అని ఆయన పేర్కొన్నారు.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

‘ఓ వైపు నరేంద్ర మోదీ.. మరోవైపు చంద్రబాబు.. ఇంకోవైపు మీరందరూ ఇష్టపడే నేను. మన పొత్తు గెలుస్తుంది. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది అన్నారు. ‘మీ నినాదాలు.. జయజయధ్వానాలే కదా పార్టీకి శక్తి’ అంటూ శ్రేణులను ఉత్సాహపరిచారు. వైకాపాకు కష్టపడి పనిచేసినా గుర్తింపులేదని ఎంపీటీసీ సభ్యులు తెలిపారని.. జనసేనలో కష్టపడితే గుర్తింపు ఇస్తానని భరోసా ఇచ్చామని పవన్‌ వెల్లడించారు.

‘భవిష్యత్తులో పవన్‌ కల్యాణ్‌ ఒక్కడే నాయకుడు కాదు.. నా తరం తర్వాత కొత్తతరం రావాలంటే ఇప్పటి నుంచే నాయకులు తయారుకావాలని’ పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. వార్డు, మున్సిపల్‌, మండల, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయిలో జనసేన బలమైన నాయకులను తయారు చేస్తుందన్నారు. ఎంతోమంది యువతకు ఉపాధి చూపి.. జనసేన కోసం కష్టపడిన కాకినాడ లోక్‌సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు. తనను మాత్రం చిన్న మెజార్టీతో కాదు.. భారీ మెజార్టీతో గెలిపించాలని కోరగా అందరూ ఉత్సాహంగా సై అన్నారు.

source : eenadu.net

Tags: 2024 electionsJanasena Partyjanasena pawan kalyan

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యానికి కారణమేంటి?

Discussion about this post

  • పాతకొత్తచెరువు
  • అరెస్ట్ చేయరా చెయ్
  • వాలంటీర్లుఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు
  • ధర్మవరం జనసేన పార్టీ ఇంచార్జ్ చిలకం మధుసూదన్ ఆధ్వర్యంలో పార్టీ లోకి చేరిన 10 కుటుంబాలు
  • అక్రమ ఓట్లను తొలగిస్తే టీడీపీకి ఓటమి తప్పదు

  • వైకాపానా.. మజాకా
  • తెలుగుదేశం అభ్యర్థుల చివరి జాబితా
  • శివ పార్వతుల కల్యాణం కి ఒక లక్ష విరాళం
  • అయిదేళ్లలో అయిదు సార్లయినా రైతుల్ని కలిశారా.. జగన్‌?
  • మాకు చెప్పకుండా విద్యార్థులకు భోజనం పెట్టిస్తారా?

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In