• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Sunday, May 18, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

జనానికి నరకం.. సిద్ధం

Naresh Kumar by Naresh Kumar
February 18, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

సీఎం సభ ప్రయాణికులకు శాపంగా మారింది. అనంతపురం జిల్లాలోని రాప్తాడులో వైకాపా ఆదివారం నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభ కోసం ఆర్టీసీ యాజమాన్యం ఏకంగా 3వేల బస్సులను కేటాయించింది. చివరకు తిరుమల, శ్రీకాళహస్తి వంటి ముఖ్య దేవాలయాలకు వెళ్లాల్సిన బస్సులనూ వదల్లేదు. ప్రయాణికులు, భక్తుల అవస్థలను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో జనం గమ్యస్థానాలకు వెళ్లేందుకు బస్టాండ్లు, రోడ్లపై గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. సభకు పెద్దఎత్తున బస్సులు తరలించడంతో రాయలసీమ అంతటా శనివారం మధ్యాహ్నం నుంచి బంద్‌ వాతావరణం నెలకొంది. కొన్ని బస్టాండులు బోసిపోయాయి. అరకొరగా ఉన్న బస్సులతో రద్దీ ఏర్పడి కొన్నిచోట్ల తోపులాటలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ తీరుతో విసుగెత్తిన ప్రజలు ముఖ్యమంత్రి జగన్‌, వైకాపా నేతలపై మండిపడుతున్నారు.

ఇప్పుడే కాదు.. మాది పేదల ప్రభుత్వమంటూ మాటలతో ఊదరగొట్టే జగన్‌.. అధికారం చేపట్టినప్పటి నుంచి వారిని ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. ప్రజలు ప్రయాణించే ఆర్టీసీ బస్సులను భారీ సంఖ్యలో అధికార పార్టీ పెట్టే సభలకు మళ్లించి అవస్థల పాల్జేస్తున్నారు. పేదలు ఎలాపోతే నాకేంటి, సిద్ధం సభకు బస్సులు ఉంటే చాలు అనేలా కర్కశంగా వ్యవహరిస్తున్నారు.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

నిరుపేద ప్రయాణికులకు సేవలందించాల్సిన ఆర్టీసీ యాజమాన్యం.. అధికార పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తోంది. ప్రతిపక్షాల సభలకు పదుల సంఖ్యలో బస్సులడిగినా ఇవ్వని ఆర్టీసీ యాజమాన్యం.. అధికార వైకాపా రాప్తాడులో నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభకు వేల బస్సులు కేటాయించడం గమనార్హం.

వైకాపా 2022 జులైలో గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో నిర్వహించిన ప్లీనరీకి ఆర్టీసీ 1,857 బస్సులు కేటాయించింది. గతనెల 27న భీమిలి సమీపంలో జరిగిన సిద్ధం సభకు 850, ఈనెల 3న దెందలూరు సభకు 1,357 బస్సులు తరలించింది. ఇప్పుడు రాప్తాడు సభకు మూడు వేల బస్సులు ఇచ్చేసింది. ఇలా ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం.. అధికార వైకాపా ముందు మోకరిల్లుతోంది. వేలాది బస్సులు ఒకేసారి మళ్లిస్తే.. ప్రయాణికులు రాకపోకలు ఎలా సాగిస్తారనేది ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఇదేమని ప్రశ్నిస్తే.. డబ్బులు చెల్లిస్తే ఏ పార్టీకి, ఏ వ్యక్తులకైనా అడిగినన్ని బస్సులు ఇస్తామని ఆర్టీసీ అధికారులు నీతి వ్యాఖ్యాలు చెబుతారు. ప్రతిపక్ష తెదేపా గత ఏడాది మేలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడుకు, ఇటీవల విజయనగరం జిల్లాలో నిర్వహించిన యువగళం ముగింపు సభ కోసం బస్సులు అడిగితే ఒక్కటీ ఇవ్వలేదు. అడ్వాన్స్‌ తీసుకొని బస్సులు పంపాలని తెదేపా నేతలు వివిధ డిపోల అధికారులను కలిసినా, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా ఆర్టీసీ ఎండీకి లేఖరాసినా ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇదిగో అదిగో అంటూ చివరికి ముఖం చాటేశారు.

450 కి.మీ. దూరం నుంచి బస్సుల తరలింపు

ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రాప్తాడులోని సిద్ధం సభకు 3 వేల బస్సులు కేటాయించారు. సంస్థలో ఆర్టీసీ సొంత బస్సులు, అద్దె బస్సులు కలిపి 10 వేలు ఉండగా, అందులో 3 వేల బస్సులు ఒకేసారి మళ్లించడంపై ఆర్టీసీ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నాయి.

source : eenadu.net

Tags: AP CM ys jagan mohan reddyrapthadu siddham sabhasiddham sabha

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

నా ఎస్సీ.. నా ఎస్టీ.. నా బీసీ.. నా ద్రోహం

Discussion about this post

  • తెదేపాతోనే నిరుద్యోగులకు న్యాయం
  • వేకువనే పోలీసు పంజా
  • గుగూడు
  • వైకాపాను ఇంటికి సాగనంపడమే లక్ష్యం
  • బతికే ఉన్నా..

  • వాలంటీర్లకు వందనమా.. వైకాపా ప్రచారమా
  • కూటమిలో కుతకుత
  • చరవాణిలో గొడవ: తమ్ముడిపై అన్నయ్య దారుణంగా దాడి చేశాడు.
  • పి.సిద్దరాంపురం
  • బ్రాహ్మణపల్లి

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In