• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Thursday, May 22, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

‘జగన్‌ 420.. సజ్జల 840’

Naresh Kumar by Naresh Kumar
February 16, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

‘ముఖ్యమంత్రి జగన్‌ ఓ 420. ఇది నేను చెప్పడం లేదు. తనపై 28 కేసులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో ఆయనే పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఓ 840. పనికిమాలిన సలహాలు ఇస్తుంటారు. ఇప్పటికే జీతాల రూపంలో రూ.150 కోట్లు లాగేశారు’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ‘పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుకు మూడు స్థానాల్లో తెదేపా విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఓట్లేసినవారు మా ఓటర్లే కాదని సజ్జల సెలవిచ్చారు. ఆయన ఎందుకలా అన్నారో ఇప్పుడు అర్థమైంది.. జాబితాల్లో దొంగ ఓట్లు ఎక్కించి వచ్చే ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని. సాక్షాత్తూ సలహాదారు సజ్జలకు మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల్లో రెండు చోట్లా ఓట్లుండడమే ఇందుకు నిదర్శనం’ అని విమర్శించారు.

విజయనగరం జిల్లా రాజాం, చీపురుపల్లి, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో గురువారం జరిగిన శంఖారావం సభల్లో లోకేశ్‌ మాట్లాడారు. ‘దొంగ ఓట్లతో వైకాపా గెలిచింది. తిరుపతి ఉప ఎన్నికల్లో గెలవడానికి కారణం వాళ్లు ఎక్కించిన దొంగ ఓట్లే. నాడు తప్పు చేస్తున్నారని అధికారులకు చెప్పినా వినలేదు. అక్రమాలకు సహకరించిన ఐఏఎస్‌, డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు సస్పెండ్‌ అయ్యారు. దర్యాప్తు నివేదిక వస్తే వారు జైలుకెళతారు. రేపోమాపో మరికొందరు అధికారులపై చర్యలుంటాయి’ అని పేర్కొన్నారు. ఈ పర్యటనలో నన్ను నలుగురు కుర్రాళ్లు కలిశారు. జగన్‌కు, మీకు తేడా ఏంటని ప్రశ్నించారు. ‘నేను ప్రజల్లో తిరుగుతున్నా.. ఆయన పరదాల మాటున తిరుగుతున్నారు. నేను స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ చదివితే.. జగన్‌ పదో తరగతి ప్రశ్నపత్రం లీకు కేసులో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. నాకు క్లాస్‌మేట్స్‌ ఉంటే.. జగన్‌కు జైల్‌మేట్స్‌ ఉన్నారు’ అని చెప్పాను.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

ఇది మన అద్భుతమైన క్యాబినెట్‌

దేశంలోనే అత్యంత చెత్త పురస్కారం జగన్‌ మంత్రిమండలికి ఇవ్వచ్చని లోకేశ్‌ విమర్శించారు. ‘దిల్లీ చుట్టూ తిరిగే అప్పుల అప్పారావు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.. ఇసుక, గనులు మింగేసే గనుల శాఖ మంత్రి పాపాల పెద్దిరెడ్డి.. నకిలీ మద్యం అమ్మకంతో పాటు న్యాయస్థానంలో దస్త్రాలను కొట్టేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి.. పిల్ల కాలువలైనా తవ్వించలేని జలవనరుల మంత్రి అంబటి రాంబాబు.. సొంతూళ్లో రైతులకు ధాన్యం సంచులు ఇవ్వలేని పౌరసరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పిల్లలు ఎక్కువ మంది చదవడంతో వారికి ఉద్యోగాలు రాలేదన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. పరిశ్రమలు ఎప్పుడు తీసుకొస్తారంటే కోడి ముందా.. గుడ్డు ముందా అని కథలు చెప్పే పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌.. ఇది మన అద్భుతమైన క్యాబినెట్‌’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 60 లక్షల మంది తెదేపా కార్యకర్తలు తన తోబుట్టువులేనన్నారు.

విజయనగరానికి బొత్స కుటుంబం క్యాన్సర్‌ గడ్డ

వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ కుటుంబాలు ఉత్తరాంధ్రలో చేసిన భూకబ్జాలు బయటపెట్టడానికి మేం సిద్ధం.. కాదని చెప్పడానికి మీరు సిద్ధమా అని లోకేశ్‌ సవాల్‌ విసిరారు. బొత్స కుటుంబం విజయనగరం జిల్లాకు క్యాన్సర్‌లా పట్టుకుందని, వచ్చే ఎన్నికల్లో తెదేపాకు ఓటేసి దాన్ని వదిలిద్దామని పిలుపునిచ్చారు. తెదేపా-జనసేన అధికారంలోకి రాగానే ప్రతి పేదవాడికి ఉచితంగా పక్కా ఇల్లు కట్టిస్తామన్నారు. రోడ్లపై గుంతల కారణంగా నిత్యం వందల మంది ప్రమాదాల బారినపడుతున్నారని, మూడు కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్‌ వాడే సీఎం జగన్‌కు అవన్నీ ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.

source :eenadu.net

Tags: 2024 election campaigningnara lokesh shocking comments on CM ys jaganshankaravamtdp

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

వాలంటీర్లే నా సైన్యం

Discussion about this post

  • తెదేపాతోనే నిరుద్యోగులకు న్యాయం
  • వేకువనే పోలీసు పంజా
  • గుగూడు
  • వైకాపాను ఇంటికి సాగనంపడమే లక్ష్యం
  • బతికే ఉన్నా..

  • వాలంటీర్లకు వందనమా.. వైకాపా ప్రచారమా
  • కూటమిలో కుతకుత
  • చరవాణిలో గొడవ: తమ్ముడిపై అన్నయ్య దారుణంగా దాడి చేశాడు.
  • పి.సిద్దరాంపురం
  • బ్రాహ్మణపల్లి

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In