• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Wednesday, May 14, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

జగన్‌ పాలనలో అందరూ బాధితులే

Naresh Kumar by Naresh Kumar
February 18, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
101
VIEWS
Share on FacebookShare on WhatsApp

జగన్‌ ప్రభుత్వంలో జనాలే కాదు.. చివరకు నేనూ, పవన్‌ కల్యాణ్‌ కూడా బాధితులమేనని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలను కలుషితం చేసిన జగన్‌ను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే పేదలకు రెండు సెంట్ల స్థలం ఇచ్చి, ఇళ్లు కట్టిస్తామని.. కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. మీ స్పందన చూస్తే ఎన్నికలకు ముందే తెదేపా- జనసేన గెలుపు ఖాయమైనట్లు కనిపిస్తోందన్నారు. జగన్‌ రెడ్డీ.. పర్చూరు పౌరుషం చూడు. టీవీ చూడాలన్నా భయమైతే మావాళ్లు వీడియో లింకు పంపిస్తారు చూడు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాబోయే ఎన్నికల్లో తెదేపా-జనసేన కూటమి సునామీ సృష్టించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం బాపట్ల జిల్లా ఇంకొల్లులో ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.

‘రాష్ట్రంలో అభివృద్ధి లేక ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. వైసీపీ పాలనలో జగన్‌ ధనవంతుడైతే ప్రజలు పేదవారయ్యారు.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

తెదేపా పాలనలో తలసరి ఆదాయం పరుగులు పెడితే నేడు పతనమైంది. రాష్ట్ర విభజన తర్వాత అనేక అడ్డంకులు, సవాళ్లు అధిగమించి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లాం. వైసీపీ ప్రభుత్వం వల్ల ఏపీ ప్రజలు నేడు ఒక్కొక్కరు రూ.88 వేల మేర ఆదాయాన్ని కోల్పోయారు. తెదేపా హయాంలో 14 శాతం ఉండే వృద్ధి రేటు వైకాపా వచ్చాక 10.93 శాతానికి పడిపోయింది. ప్రభుత్వానికి ఏడాదికి రూ.30 వేల కోట్ల ఆదాయం తగ్గిపోయింది. విభజన జరిగినప్పుడు ఏపీ కంటే తెలంగాణకు 35 శాతం తలసరి ఆదాయం అధికంగా ఉంటే 2014 తర్వాత ఏపీలో సుపరిపాలన ద్వారా ఆ వ్యత్యాసాన్ని 27.5 శాతానికి తగ్గించాం. ఇప్పుడు జగన్‌ నిర్వాకంతో తలసరి ఆదాయంలో రాష్ట్రం తెలంగాణతో పోలిస్తే 44 శాతం తక్కువగా ఉంది. మళ్లీ రాష్ట్రాభివృద్ధి జరగాలంటే తెదేపా-జనసేన ప్రభుత్వం రావాలి’ అని అన్నారు.

పులివెందుల నుంచే నీ పతనం ప్రారంభం

‘జగన్‌ నీ పని అయిపోయింది. నీ పాలనకు ఇక మిగిలింది 52 రోజులే. ప్రజలు ఎంతో కసితో తిరుగుబాటు చేస్తున్నారు. పర్చూరు సభకు స్వచ్ఛందంగా వచ్చిన జనాన్ని చూస్తే నీకు రాత్రికి నిద్రపట్టదు. నీ డబ్బు సంచులు, దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగం, అక్రమ కేసులు నీ ఓటమిని ఆపలేవు. పులివెందుల నుంచే నీ పతనం మొదలవుతుంది. నా రాజకీయ అనుభవం ముందు నువ్వో బచ్చా. నీలాంటి వ్యక్తికి భయపడను. తండ్రిని అడ్డుపెట్టుకుని రూ.43 వేల కోట్లు దోచుకున్నా నీలో మార్పు రాలేదు’ అని దుయ్యబట్టారు. జగన్‌కు ఉదయం అల్పాహారం ఇసుక, మధ్యాహ్నం భోజనం మైన్స్‌, రాత్రికి జే బ్రాండు మద్యం డబ్బులు కావాలని విమర్శించారు. పోయే ప్రభుత్వాన్ని మోస్తే మునిగిపోయేది మీరేనని పోలీసులకు హితవు పలికారు.

మీరు చొక్కాలు మడతపెడితే.. మావాళ్లు కుర్చీలు మడతపెడతారు

వాలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో చొక్కా మడత పెడదామంటూ సీఎం రెచ్చగొట్టేలా వ్యవహరించారు.. ‘మీరు చొక్కాలు మడతపెడితే మా వాళ్లు కుర్చీలు మడతపెడతారు. అప్పుడు మీ కుర్చీ ఊడిపోతుంది. మా వాళ్లందరూ ఇస్త్రీ పెట్టెలు తీసుకుని మీ చొక్కాలకు ఇస్త్రీ చేస్తారు. రాజకీయాల ముసుగులో రౌడీయిజం చేస్తామని, అధికారం ఉందని ఊరి మీద ఆంబోతుల్లా పడితే చూస్తూ ఊరుకోం’ అని హెచ్చరించారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లను అభినందిస్తామని కానీ వైకాపాకు సేవ చేసే వాలంటీర్లపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘పర్చూరులో అధికారులు వైకాపా అల్లరిమూకలతో కలిసి వెళ్లి మైనింగ్‌ వ్యాపారులను బెదిరించారు. వారిపై కేసులు పెట్టి వేధించారు. వైకాపా నేతల బెదిరింపు పర్వంతో బయటికి వెళ్లిపోయినవారందర్నీ రప్పించి, గ్రానైట్‌ పరిశ్రమకు గత వైభవం తీసుకొస్తాం’ అని చెప్పారు.

source : eenadu.net

Tags: 2024 election campaigningbapatlachandra babu naidupawan kalyanra kadali ra sabhatdp

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

జనానికి నరకం.. సిద్ధం

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In