• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Sunday, May 25, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

జగన్‌ ఆస్తుల్ని జనాలకు పంచుతాం

Naresh Kumar by Naresh Kumar
February 19, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

‘తెదేపా- జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్‌ ఆస్తులు, భూములు, ప్యాలెస్‌లను జప్తు చేస్తాం. వాటిని పేద ప్రజలకు పంచిపెడతాం’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెల్లడించారు. మద్యం, ఇసుక, గ్రావెల్‌, భూముల కుంభకోణాలతో రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని జగన్‌ లూటీ చేశారని మండిపడ్డారు. ‘ఎన్నో పాపాలు చేసిన జగన్‌ ఇటీవల నిజాలు మాట్లాడుతున్నారు. తనకు టీవీ, పత్రిక, ప్యాలెస్‌లు లేవని చెబుతున్నారు. నిజమే. అవన్నీ ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినవి. తిరిగి ప్రజలకే చెందుతాయ’ని స్పష్టం చేశారు. ఆదివారం విశాఖ జిల్లాలోని తూర్పు, దక్షిణ, పశ్చిమ నియోజకవర్గాల్లో శంఖారావం సభల్లో లోకేశ్‌ ప్రసంగించారు. అంతకుముందు ఆయన సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.

‘వైకాపా పాలనలో గంజాయి కారణంగా లక్షల కుటుంబాలు నాశనమవుతున్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు రాష్ట్రమంతటా గంజాయి సరఫరా చేస్తున్నారు. మన ప్రభుత్వం ఏర్పడ్డాక దీనిపై ఉక్కుపాదం మోపుతాం’ అని హెచ్చరించారు. ‘ఇసుక ద్వారా జగన్‌ అయిదేళ్లలో రూ.5,400 కోట్లు అక్రమంగా సంపాదించారు. తెదేపా హయాంలో ఇసుక ఉచితంగా ఇస్తే, ఇప్పుడు వైకాపా నాయకులు పందికొక్కుల్లా తినేస్తున్నారు. యాత్ర-2 సినిమా చూసిన వైకాపా ఎమ్మెల్యేలు తమకిదే అంతిమయాత్ర అని పారిపోతున్నారు. జగన్‌ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి యుద్ధం జరగబోతోంది. అర్జునుడిని, అభిమన్యుడని చెప్పుకుంటున్న జగన్‌.. ఓ సైకో. భస్మాసురుడు. అతన్ని ఓడించి పేదలు ఆత్మగౌరవం చాటుకోవాల’ని లోకేశ్‌ పిలుపునిచ్చారు.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

నేరాలకు అడ్డాగా విశాఖ

‘ప్రచారానికి వస్తున్న వైకాపా నాయకులను జనం ప్రశ్నించాలి. విశాఖ ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్‌ చేసిందెవరు? ఎంపీ కుటుంబానికే రక్షణ లేకపోతే మనల్ని ఎలా రక్షిస్తారో అడగాలి. విశాఖకు రైల్వే జోన్‌, మెట్రో ప్రాజెక్టు, పరిపాలన రాజధాని, పరిశ్రమలను తీసుకొస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం.. అవేవీ చేయకపోగా నేరాల అడ్డాగా మార్చింది. టీడీఆర్‌ బాండ్ల కుంభకోణాలకు పాల్పడింది. వైకాపా నేతలు దసపల్లా, హయగ్రీవ, సీబీసీఎన్‌సీ చర్చి భూములు కొట్టేశారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీటన్నింటిపై విచారణ జరిపిస్తామ’ని స్పష్టంచేశారు. కృష్ణపట్నం పోర్టులో పది వేల మంది కార్మికులను రోడ్డున పడేశారని లోకేశ్‌ మండిపడ్డారు.

కళాశాలలకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌

‘వసతిగృహాల్లోని విద్యార్థులకు ఇచ్చే కాస్మెటిక్‌ ఛార్జీల్లో జగన్‌ కోతపెట్టారు. డిగ్రీ విద్యార్థులకు రూ.8 వేలు, ఇంజినీరింగ్‌ చేస్తే రూ.32 వేల ఫీజు రీయింబర్స్‌మెంటు ఇచ్చి మిగతా సొమ్ము ఎగ్గొడుతున్నారు. గతంలో తెదేపా అమలు చేసిన విదేశీ విద్యను మళ్లీ తీసుకొస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంటు డబ్బులు కళాశాలలకే ఇస్తాం’ అని లోకేశ్‌ వెల్లడించారు. ‘ప్రజల కష్టాలు చూసి చంద్రబాబు-పవన్‌ సూపర్‌-6 హామీలు ప్రకటించారు. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు ఏటా డీఎస్సీ వేస్తాం. ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేస్తాం. ఉద్యోగం రాని యువతకు నిరుద్యోగ భృతి ఇస్తాం. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు చొప్పున అందజేస్తాం. ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు, ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు అందిస్తాం. 18 నుంచి 59 ఏళ్లున్న మహిళలకు ప్రతినెలా రూ.1500 చొప్పున అయిదేళ్లలో రూ.90 వేలు వస్తాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామ’ని లోకేశ్‌ ప్రకటించారు. అంతకుముందు కార్యకర్తలకు ప్రోత్సాహక అవార్డులు, సూపర్‌-6 కిట్లు పంపిణీ చేశారు.

source : eenadu.net

Tags: 2024 election campaigningNara Lokeshshankaravamtdp

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

జగన్‌ సిద్ధం అన్నారు.. జనం పరుగు తీశారు

Discussion about this post

  • పాతకొత్తచెరువు
  • అరెస్ట్ చేయరా చెయ్
  • వాలంటీర్లుఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు
  • ధర్మవరం జనసేన పార్టీ ఇంచార్జ్ చిలకం మధుసూదన్ ఆధ్వర్యంలో పార్టీ లోకి చేరిన 10 కుటుంబాలు
  • అక్రమ ఓట్లను తొలగిస్తే టీడీపీకి ఓటమి తప్పదు

  • వైకాపానా.. మజాకా
  • తెలుగుదేశం అభ్యర్థుల చివరి జాబితా
  • శివ పార్వతుల కల్యాణం కి ఒక లక్ష విరాళం
  • అయిదేళ్లలో అయిదు సార్లయినా రైతుల్ని కలిశారా.. జగన్‌?
  • మాకు చెప్పకుండా విద్యార్థులకు భోజనం పెట్టిస్తారా?

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In