• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Thursday, May 15, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం

Naresh Kumar by Naresh Kumar
February 7, 2024
in రాజకీయం
Reading Time: 2min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

నడిరోడ్డుపై కానిస్టేబుల్‌ను స్మగ్లర్లు చంపేశారు

రాష్ట్రంలో పోలీసులకు రక్షణ ఉందా?

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

వాలంటీర్లు నా స్టార్‌ క్యాంపెయినర్లు

గంగాధరనెల్లూరులో జరిగిన ‘రా..కదలిరా’ సభలో చంద్రబాబు ధ్వజం

‘జగన్‌ తీవ్ర మానసిక ఆవేదనలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థమై రాత్రిళ్లు ఆయనకు నిద్ర పట్టడం లేదు. అందుకే అవినీతి డబ్బుతో సిద్ధమంటూ పెద్దపెద్ద కటౌట్లు పెడుతున్నారు. నేను ఒకటే చెబుతున్నా మిమ్మల్ని(సీఎంను) ఓడించి ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధమయ్యారు. ‘సిద్ధం’ కటౌట్లు చూసిన ప్రతిసారీ ప్రభుత్వం పెట్టిన బాధలు, బాదుడు, హింసా రాజకీయాలు, తరలిపోయిన పరిశ్రమలు, వలసలు గుర్తుకు రావాలి. తెదేపా, జనసేన జెండాలు పట్టుకుని 60 రోజులు సైకిల్‌ ఎక్కి ప్రచారం చేయండి.. మీ భవిష్యత్తును బంగారం చేస్తా. మీరు బటన్‌ నొక్కితే జగన్‌ మైండ్‌ బ్లాక్‌ అవ్వాలి’ అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం రామానాయుడుపల్లెలో మంగళవారం నిర్వహించిన ‘రా..కదలిరా’ సభలో ఆయన మాట్లాడారు. తిరుమలను అపవిత్రం చేస్తున్నారని.. వేంకటేశ్వరస్వామిని అధికార పార్టీ నాయకులు రాజకీయాలు, పైరవీలకు వాడుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తిరుపతిని దొంగ ఓట్లకు కేంద్రంగా మార్చారని.. ఎన్నికల సంఘం కార్యాలయంలో ఐప్యాక్‌ ప్రతినిధులు చొరబడి తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల దస్త్రాలను దొంగిలించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

వాలంటీర్లను తొలగిస్తామని తప్పుడు ప్రచారం

‘తెదేపా వస్తే వాలంటీర్లను తొలగిస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు సేవ చేసే వారికి ఎప్పుడూ మేం వ్యతిరేకం కాదు. మంచి పనిచేసే వాలంటీర్లకు సహకరిస్తాం. జగన్‌ వల్ల రాష్ట్రం ఎలా నష్టపోయిందో ప్రతి ఇంటికీ వెళ్లి మీరు వివరించండి. మీరే (వాలంటీర్లు) నాకు స్టార్‌ క్యాంపెయినర్లు. ఆస్తుల పంపకం సరిగా జరగలేదని జగన్‌ చెల్లెలు తిరగబడింది. అంతఃపురం వాస్తవాలు ఆమె చెబుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14కు 14 సీట్లు గెలిపిస్తే ఇక్కడ పుట్టిన మీ బిడ్డగా రుణం తీర్చుకుంటా’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

మేం అధికారంలోకి వస్తేనే.. డీఎస్సీ

‘జగన్‌.. రాష్ట్రానికి పట్టిన శని గ్రహం. ఆంధ్రప్రదేశ్‌ను రాతియుగం వైపు నడిపిస్తున్నారు. ఇక్కడ యువత, ఆడబిడ్డలను చూస్తుంటే రాబోయేది తెలుగుదేశం- జనసేన ప్రభుత్వమే అనిపిస్తోంది. మేం అధికారంలోకి వస్తేనే డీఎస్సీ వస్తుంది’ అని తెదేపా అధినేత స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి అమరనాథరెడ్డి, చిత్తూరు, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని, నరసింహయాదవ్‌, గంగాధరనెల్లూరు తెదేపా, జనసేన ఇన్‌ఛార్జులు థామస్‌, పొన్నా యుగంధర్‌, దొరబాబు, గురజాల జగన్‌, హేమలత, రాజన్‌, తేజేశ్వరి, శ్రీధర్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

source : eenadu.net

Tags: chandrababu naiduchittor districtra kadali ra sabhatdp

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

ఏ ప్రభుత్వం వచ్చినా.. 8 పథకాలు అమలు చేయాల్సిందే

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In