• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Wednesday, May 14, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

ఐదేళ్లకొచ్చారు జగన్‌

Naresh Kumar by Naresh Kumar
May 4, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

ముఖ్యమంత్రి జగన్‌కు హిందూపురం అంటే గుర్తుకు వచ్చేది ఎన్నికల సమయంలోనే. మిగిలిన సమయాల్లో ఇది రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గం అనేది గుర్తు లేదు. ఆయన ఇప్పటి దాక 2014, 2019 సంవత్సరాల్లో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. మరో సారి 5 ఏళ్ల తరువాత శనివారం ఓట్ల కోసం పట్టణానికి వస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నేరవేర్చలేదు. హిందూపురానికి ఒక్కటంటే ఒక్క పనీ చేయలేదు. అభివృద్ధి పనుల కోసం రూపాయీ మంజూరు చేయలేదు. కానీ, అనేక రూపాల్లో ప్రజలపై భారం మోపారు. ప్రతి పార్లమెంటు కేంద్రాన్ని జిల్లా కేంద్రం చేస్తానని చెప్పి, చివరకు పార్లమెంటు కేంద్రమైన, రెండు లక్షల జనాభా ఉన్న హిందూపురాన్ని వదిలేసి పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేశారు. ఎన్టీఆర్‌ హయాంలో ఇక్కడ పెట్టిన అనేక జిల్లాస్థాయి కార్యాలయాలనూ ఇతర ప్రాంతాలకు తరలించారు.

పురానికి పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉంది. ఇక్కడికి సమీపంలోనే కర్ణాటక ప్రభుత్వం పారిశ్రామికవాడను ఏర్పాటు చేసి ప్రోత్సహించడంతో పరిశ్రమలు అక్కడికి వెళ్లిపోయాయి. పారిశ్రామికవాడకు గత 5 ఏళ్లలో కనీస సదుపాయాలు కల్పించలేదు. హిందూపురానికి మంజూరైన మెడికల్‌ కళాశాలను పెనుకొండకు తరలించారు. విద్యకు అధిక ప్రోత్సాహం ఇస్తున్నామని చెప్పినా, ప్రభుత్వ బాలుర డిగ్రీ, జూనియర్‌ కళాశాలలకు అధ్యాపకులను నియమించకపోవడంతో మూతపడ్డాయి. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ పేరుతో వేలాది ఎకరాలను చిలమత్తూరు మండలంలో సేకరించి రైతుల పొట్టకొట్టారు. తమకు కావాల్సిన వారికి విలువైన భూములను ధారాదత్తం చేశారు. ఎకరా కోటి రూపాయలు పలికే భూమిని నామమాత్రంగా రూ.1.75 లక్షలకు తీసుకొన్నారు. అయితే ఈ ప్రాంత అభివృద్ధికి కనీస చర్యలు తీసుకోలేదు.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షిలో ఏటా జరిగే ఉత్సవాలను సైతం నిలిపివేశారు. యునెస్కో గుర్తింపు తీసుకురాలేకపోయారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణంలో రూ.76 కోట్లతో ప్రతిపాదించిన అంతర్గత నీటి సరఫరా వ్యవస్థ పనులను అటకెక్కించారు. దీంతో పట్టణంలో నీటి సమస్య పరిష్కారం కాలేదు. రూ.66 కోట్లతో బాలయ్య ఆధ్వర్యంలో చేపట్టిన రహదారుల నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిపివేశాయి. రూ.155 కోట్లతో నిర్మించిన టిడ్కో భవనాలను లబ్దిదారులకు అప్పగించకుండా వదిలేశారు. దీంతో అవి శిథిలావస్థకు చేరుతున్నాయి. మరో వైపున జగనన్న కాలనీలంటూ ఆర్భాటం చేసినా, ఒక్క ఇంటిని నిర్మించలేదు. హిందూపురం నియోజకవర్గంలో 10 వేలమంది చేనేత కార్మికులు పనిచేస్తున్నారు. వారికి ఎలాంటి ప్రోత్సాహం లేదు. దీంతో మగ్గాలు మూత పడుతున్నాయి. పట్టణంలో ఏటా 15 శాతం ఆస్తి పన్ను పెంచి, పట్టణ ప్రజలపై భారం మోపారు. కొత్తగా చెత్త పన్ను విధించారు. అయినా నియోజకవర్గ అభివృద్ధికి 5 ఏళ్లలో ఒక్క రూపాయీ విడుదల చేయలేదు. రోడ్ల మీద పడిన గుంతలను పూడ్చలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది.

హిందూపురం అంటేనే పట్టు, పాడి పరిశ్రమకు పేరు. ఆ రైతులకు సహకరించకపోగా వారి పరిస్థితిని మరింత దిగజార్చారు. పట్టు రైతులకు అనేక రకాల ప్రోత్సాహకాలు తెదేపా హయాంలో ఉండేవి. ఇవికాక కిలో పట్టుగూళ్లకు రైతుకు రూ.100 నగదు ప్రోత్సాహం ఇచ్చేవారు. నిబంధనల కారణంగా ఇవ్వకపోవడంతో పట్టు రైతులకు చంద్రబాబు రూ.3 కోట్లు బకాయిలు పెట్టారని, తానైతే మరింత అదనంగా ఇస్తానని జగన్‌ గత ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లుగా పట్టు గూళ్లకు ప్రోత్సాహం సొమ్ము చెల్లించకపోవడంతో బకాయిలు రూ.60 కోట్లకు చేరాయి. పట్టు పరిశ్రమ ప్రోత్సాహానికి గత ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలను ఎత్తివేశారు. పాడి పరిశ్రమను ఆదుకొంటానని హామీ ఇచ్చారు. చివరకు నడుస్తున్న డెయిరీని మూసివేశారు. అమూల్‌కు అప్పగించినా.. అది తెరుచుకోలేదు. దీంతో పాడి పరిశ్రమ దెబ్బతింది. హిందూపురానికి పరిశ్రమలు తీసుకొస్తానని, ఉపాధి కల్పిస్తానని చెప్పినా, ఒక్క పరిశ్రమా రాలేదు. ఉన్నవాటికి ప్రోత్సాహం లేక మూతపడ్డాయి. రహేజా వస్తోందంటూ హడావుడి చేసినా, అడుగు ముందుకు పడలేదు.

source : eenadu.net

Tags: 2024 election campaigningAP CM YS jagancm ys jagan election campaign in hindupuramhindupuramysrcp

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

రాప్తాడు పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌లో గందరగోళం

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In