• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Tuesday, May 13, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

ఏపీ సీఎస్‌, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం

Naresh Kumar by Naresh Kumar
April 19, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

ఆంధ్రప్రదేశ్‌లోని సీనియర్‌ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా చెప్పారు. ఆ ఫిర్యాదుల్లోని అంశాలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకుని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామన్నారు. దీంతోపాటు కేంద్ర నిఘా విభాగం ద్వారా, ఇతర పద్ధతుల్లో ఆ ఫిర్యాదులపైన విచారించుకుని ఈసీఐ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తదితర ఉన్నతాధికారులపై అందిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకుంటున్నారు?’ అంటూ విలేకరులు ప్రశ్నించగా.. ముకేశ్‌కుమార్‌ మీనా ఈ మేరకు సమాధానమిచ్చారు.

వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ చేసేందుకు అవకాశమున్నా.. ఉద్దేశపూర్వకంగానే అలా పంపిణీ చేయకుండా ఇబ్బందులు కల్పించారని, దీంతో కొంతమంది వృద్ధులు చనిపోయారని ఫిర్యాదులందాయి. దీనిపై సంబంధిత శాఖ నుంచి వివరణ తీసుకుని ఈసీఐకి నివేదించాం. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై రాయి విసిరిన ఘటనకు భద్రతావైఫల్యమే కారణమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఈ ఘటన జరిగిన వెంటనే విజయవాడ పోలీసు కమిషనర్‌ను పిలిపించి నివేదిక తీసుకున్నాం. దర్యాప్తు తీరుపై రోజువారీ నివేదికలు తీసుకుంటున్నాం. కేసు దర్యాప్తు నడుస్తోంది. ఒకర్ని అరెస్టు చేశారు. ముఖ్యమంత్రిపై రాయి దాడి జరిగిన సమయంలో వెలుతురు లేదు.. స్పాటర్లు లేరు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేలా జెడ్‌ ప్లస్‌, ఎస్పీజీ సెక్యూరిటీ ఉన్న ప్రముఖుల భద్రత విషయంలో అనుసరించాల్సిన ప్రామాణిక నిర్వహణ పద్ధతులను (ఎస్‌ఓపీ) అన్ని జిల్లాల ఎస్పీలకు పంపించాం. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎక్కువ ఫిర్యాదులందుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారించింది. అందులో భాగంగా 18 మంది పోలీసు పరిశీలకుల్ని నియమించింది’ అని మీనా వివరించారు. ఆయన మాటల్లోని ఇతర ప్రధానాంశాలివీ.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. వారు రాజీనామా చేసి బయటకు వెళ్లిపోతే వారిపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ ఉండదు. నిబంధనల ప్రకారం ఓటరు జాబితాలో పేరున్న స్థానికులు పోలింగ్‌ ఏజెంట్‌గా ఉండేందుకు అర్హులు. అయితే ఎవరిపైనైనా నిషేధం విధించాలంటే కొత్త ప్రొవిజన్‌ పెట్టాలి. ఆ అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికే ఉంది. వాలంటీర్లుగా రాజీనామా చేసిన వారిని పోలింగ్‌ ఏజెంట్లుగా అనుమతించొచ్చా లేదా అనే అంశంపై ఈసీఐ నిర్ణయం తీసుకుంటుంది.

‘రాష్ట్రవ్యాప్తంగా 30,111 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాం. ఆయా కేంద్రాల్లో హింసాత్మక ఘటనలు జరగకుండా పోలింగ్‌ కేంద్రం లోపల, బయట కూడా ఒక్కో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసి, పర్యవేక్షిస్తాం. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి ఒకరు చొప్పున సాధారణ ప్రత్యేక పరిశీలకుడు, ప్రత్యేక పోలీసు పరిశీలకుడు, ప్రత్యేక వ్యయ పరిశీలకులను ఇప్పటికే నియమించింది. 175 శాసనసభ నియోజకవర్గాలకు 50 మంది సాధారణ పరిశీలకులు, 18 మంది పోలీసు పరిశీలకులు నియమించింది. వ్యయ పరిశీలకులుగా లోక్‌సభ స్థానాలకు 25 మందిని, శాసనసభ స్థానాలకు 50 మందిని పంపింది. వారు ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఓటింగ్‌ సరళిని పర్యవేక్షించి ఈసీకి నివేదిస్తారు. మద్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రత్యేక పోలీసు పరిశీలకుడు ఆదేశించిన నేపథ్యంలో అన్ని తయారీ కేంద్రాలు, గోదాంలో పాటు, వాటి వాహనాలకు కూడా జీపీఎస్‌ను అనుసంధానం చేయాలని ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేశాం. తయారీ కేంద్రం నుంచి విక్రయానికి కాకుండా మధ్యలో ఎక్కడికీ వెళ్లకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, ఉద్యోగులు, పాత్రికేయులు, అత్యవసర సేవల ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను మే 10లోపు పూర్తి చేయాలని నిర్ణయించాం. ఎన్నికల విధుల కోసం సుమారు 5.50 లక్షల మంది ఉద్యోగులను వినియోగించనున్నాం. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే ఇంటింటి ప్రచారానికి ముందస్తు సమాచారమివ్వాలని రాజకీయ పార్టీలకు సూచించాం.

source : eenadu.net

Tags: ap cs dgpap election commissioner mukeshkumar meenaAp volunteer

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In