గుత్తిలో సీఎం జగన్ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి చెప్పు విసిరారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హఠాత్తుగా పైనుంచి చెప్పు పడటంతో పోలీసులు, సీఎం అంగరక్షకులు ఉలిక్కిపడ్డారు. ఆ సమయంలో బస్సుపై సీఎం జగన్తోపాటు గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ నైరుతిరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్కుమార్ ఉన్నా ఎవరిపైనా చెప్పు పడలేదు. అయితే దీనిపై పోలీసులు, వైకాపా నాయకులు గానీ స్పందించలేదు.
source : eenadu.net
Discussion about this post