తాడిమర్రి, ముదిగుబ్బ మండల్లాలోని చిత్రావతి ముంపు గ్రామాలైన సీసీరేవు, మర్రిమాకులపల్లి, రాఘవపల్లి, పీసీరేవు గ్రామాల ప్రజలు ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు అధికారులు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. గత మూడేళ్లుగా ఓటు హక్కు కల్పించాలని ముంపు గ్రామాల ప్రజలు ప్రభుత్వం, అధికారులతో పోరాటం చేస్తూనే ఉన్నారు. వారి సమస్యలపై ‘ఈనాడు-ఈటీవీ’లో వరుస కథనాలు వెలువడ్డాయి. దీంతో ప్రభుత్వం స్పందించి ఆయా గ్రామాల్లో నివాసం ఉన్న ప్రజలకు ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాగా వారం రోజుల కిందట సీసీరేవు, మర్రిమాకుపల్లి గ్రామాలను గుర్తిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్రామంలో అర్హులను గుర్తించి ఓటు హక్కు నమోదు చేయించాలని స్థానిక రెవెన్యూ అధికారులను కలెక్టర్ అరుణ్బాబు, ఆర్డీవో రమేశ్ ఆదేశించారు. దీంతో రెండు రోజుల నుంచి గ్రామాల్లో తిరుగుతూ అర్హులైనవారి సక్రమంగా ఉన్న ధ్రువపత్రాలను పరిశీలించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దీనిపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
source : eenadu.net
Discussion about this post