• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Tuesday, May 13, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

ఆడబిడ్డల ‘కలలకు రెక్కలు’

Naresh Kumar by Naresh Kumar
March 14, 2024
in రాజకీయం
Reading Time: 2min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన ఆడబిడ్డలు దేశంలోని పేరున్న విద్యాసంస్థల్లో చేరి ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తి చేయాలన్నా, విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు అభ్యసించాలన్నా.. అందుకు అవసరమయ్యే బ్యాంకు రుణానికి ప్రభుత్వం హామీ ఇవ్వడంతోపాటు వడ్డీ మొత్తాన్ని చెల్లిస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ వరకు మాత్రమే ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ఇచ్చి ఆపేస్తోందని.. దీంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులు చదివే అవకాశాన్ని ఆడబిడ్డలు కోల్పోతున్నారని వివరించారు. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఉపకరించే ఏ కోర్సులకైనా ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం ద్వారా ఆర్థిక అండదండలు అందిస్తామన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం ఆయన ‘కలలకు రెక్కలు’ నమోదును అధికారికంగా ప్రారంభించారు. ‘ప్రపంచవ్యాప్తంగా యువతకు ఎన్నో అవకాశాలున్నాయి. ఎన్నో కలలు, వాటిని సాధించే శక్తి, రాణించే చురుకుదనం ఉంది. అయితే ఇంటర్‌ తర్వాత ఎంతో మంది ఆడబిడ్డలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులకు వెళ్లలేకపోతున్నారు. ఉపకారవేతనాలున్నా అవి కొంత మేరకే ఉపయోపడుతున్నాయి. విదేశీ విద్య పథకం ఉన్నా కొందరికే పరిమితమైంది. రూ.వేల కోట్లలో ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం రుణ హామీ అయినా ఇస్తే.. ఆడబిడ్డలు వంద రెట్లు ఎక్కువ సంపాదిస్తారు’ అని వివరించారు. అధికారంలోకి వచ్చాక కలలకు రెక్కల పథకం అమలు చేస్తూనే.. ఇతర పథకాల్ని కూడా కొనసాగిస్తామని తెలిపారు. ‘ఆడబిడ్డలు బ్యాంకు రుణం తీసుకుని స్వేచ్ఛగా ఉన్నత చదువులు చదివే అవకాశాన్ని కల్పిస్తాం. ఎంత డబ్బుకు అయినా ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. ఉన్నత పాఠశాల స్థాయి నుంచే నైపుణ్యాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవచ్చు’ అని చెప్పారు. ఇప్పటి వరకు 12వేల మంది ఇందులో నమోదు చేసుకున్నారని, ఇంటర్‌ పూర్తయిన ప్రతి ఆడబిడ్డావెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని చంద్రబాబు కోరారు. అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నమోదు పూర్తయిన వెంటనే ధ్రువీకరణ పత్రం కూడా వస్తుందన్నారు. ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం ద్వారా ఇది ఆడబిడ్డల భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడి అని పేర్కొన్నారు. ఉద్యోగం చేసే వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంపాదిస్తున్నారన్నారు. ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదు. అయితే వారికి మెరుగైన అవకాశాలను కల్పించాలి’ అని వివరించారు.

అన్ని రంగాలకూ ప్రోత్సాహం

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

ఐటీ ఒక్కటే కాకుండా.. ఏ రంగంలో విజ్ఞానం సంపాదించుకోవాలన్నా ‘కలలకు రెక్కలు’ ద్వారా ప్రోత్సాహం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ ఏ రంగంలో అయినా సంపాదించుకోవచ్చు. ఆకాశమే హద్దు. మీ కలల్ని నిజం చేసుకోవడానికి మేం తోడ్పడతాం. ప్రపంచం మారిపోతోంది. అన్ని రంగాల్లో పెనుమార్పులు వస్తున్నాయి. సేవా రంగంలో భారత్‌ దూసుకెళ్తోంది. దీన్ని అందిపుచ్చుకోవాలి’ అని సూచించారు. ‘వ్యవసాయంలో డ్రోన్‌ టెక్నాలజీ వచ్చింది. పొలంలో ఎక్కడైనా తెగులు ఉంటే డ్రోన్‌ వెళ్లి గుర్తిస్తుంది. ఎక్కడ ఏ మందు అవసరమో, అక్కడ మాత్రమే పిచికారీ చేయడం ద్వారా మొత్తం పొలానికి చల్లాల్సిన పని లేకుండా ఖర్చు తగ్గించుకోవచ్చు’ అని వివరించారు.

నేను నష్టపోయినా.. జాతి బాగుపడింది

‘విదేశాల్లో ఉండే వారిలో భారతీయుల తలసరి ఆదాయం అధికం. అందులోనూ తెలుగువారు మరింత ఎక్కువ. గతంలో ఐటీని ప్రోత్సహించాం. అందుకు అవసరమైన కంపెనీలను హైదరాబాద్‌కు తెచ్చాం. హైటెక్‌సిటీ నిర్మించాం. పనిచేసే వాళ్లకు ఉద్యోగాల కల్పన, చదువుకునే వారికి విద్యాసంస్థలను ఏర్పాటు చేశాం. ఐటీ ఉద్యోగులంతా ఇతర దేశాలకు వెళ్లడంతో.. తెదేపా ఓట్లన్నీ విదేశాలకు వెళ్లిపోయాయని అంటుంటారు. నేను నష్టపోయినా జాతి బాగుపడింది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

మహిళలకు శక్తి ఇస్తున్నాం

‘తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ‘మహాశక్తి’ కింద అయిదు కార్యక్రమాలు అమలు చేస్తాం. కుటుంబాల్ని పైకి తెచ్చేందుకు అవసరమైన శక్తిని మహిళలకు ఇస్తున్నాం’ అని చంద్రబాబు వివరించారు.

  1. తల్లికి వందనం- ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ.. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15వేల చొప్పున
  2. దీపం – ఏడాదికి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితం
  3. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
  4. 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలు అందరికీ.. ఒక్కొక్కరికి నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18వేలు.. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ
  5. తాగునీటి ఇబ్బంది లేకుండా.. రక్షిత మంచినీటి సరఫరా

source : eenadu.net

Tags: ex cm chandrababu naidukalalaku rekkalu scheemetdp

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

వచ్చే ఎన్నికల్లోనూ బాలయ్య విజయం తథ్యం

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In